ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohanbabu) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ బాబు సోదరుడు (తమ్ముడు) రంగస్వామి నాయుడు (Rangaswamy naidu) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు రంగస్వామి నాయుడు. ఆయన వయసు 63 సంవత్సరాలు. రంగస్వామి నాయుడు తన కుటుంబంతో పాటు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. బుధవారం (నేడు) తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం రంగస్వామి నాయుడు కన్నుమూశారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తమ్ముడి మరణవార్త తెలిసిన వెంటనే మోహన్ బాబు తిరుపతికి పయనమయ్యారు. పలువురు మోహన్ బాబును ఫోన్ లో పరామర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి