Drishyam 3 | మలయాళంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన చిత్రం దృశ్యం (Drishyam). సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ (Mohan lal), మీనా కాంబోలో వచ్చిన ఈ ప్రాంఛైజీలో దృశ్యం 2 కూడా వచ్చింది. కాగా ఇప్పుడిక మరోసారి ట్విస్టులతో కూడిన థ్రిల్ను ప్రేక్షకులకు అందించేందుకు మూడో పార్టుకు సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. దృశ్యం 3 సోమవారం లాంచ్ అయింది.
కేరళలోని పూతొట్ట లా కాలేజీలో మోహన్ లాల్, జీతూజోసెఫ్ అండ్ టీం సమక్షంలో పూజా కార్యాక్రమాలతో దృశ్యం ఘనంగా మొదలైంది. దీంతోపాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. మూడో పార్టులో కూడా మీనా మరోసారి తన పాత్రలో కనిపించనుంది. దృశ్యం 3లో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీం. మొత్తానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం థర్డ్ పార్టుకు సంబంధించి క్రేజీ వార్తను షేర్ చేసి మూవీ లవర్స్తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు మోహన్లాల్.
జార్జ్కుట్టీ ప్రపంచంలోకి మరోసారి తీసుకొస్తూ.. అంటూ మోహన్ లాల్ షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని తెరకెక్కిస్తోంది.
Bringing Georgekutty’s world alive once again…
Today marks the beginning of Drishyam 3 with the Pooja.#Drishyam3 #JeethuJoseph #AashirvadCinemas #Drishyam pic.twitter.com/olQYQZR1WF— Mohanlal (@Mohanlal) September 22, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
Venky 77 | వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫన్ రైడ్.. వెంకీ 77 సెట్స్పైకి వెళ్లే టైం ఫిక్స్..!