తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెలువడిన ఫలితాలలో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 234 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమి 152 స్థానాలలో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.
మంగళవారం రోజు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్.. స్టాలిన్ను మర్యాద పూర్వకంగా కలిసారు. స్టాలిన్తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు కూడా పుష్ప గుచ్ఛం ఇచ్చి కొద్ది సేపు ముచ్చటించారు. ప్రస్తుతం వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా, తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున పోటీ చేసిన కమల్ హాసన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.