ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నటి మోనాల్ గజ్జర్ విసిరిన చాలెంజ్ని గుజరాత్ నటుడు మిత్రా గాద్వి స్వీకరించారు. శనివారం గుజరాత్లోని వడోదరలో తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కి నటుడు మిత్రా గాద్వి ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నటుడు రౌనక్ కామ్దార్, నటి జాతీయ అవార్డు గ్రహీత నీలం పాంచల్, నటి నేత్రి త్రివేదిలకు మిత్రా గాద్వి గ్రీన్ చాలెంజ్ విసిరారు.