కొవిడ్ కేసులు పెరగడానికి కారణాలను అన్వేషించాలి
లక్షణాలు ఉన్న వారందరికీ వైద్యం అందించాలి
హోంఐసోలేషన్లో ఉన్నవారు బయట తిరగొద్దు
రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడుశ్రీనివాసరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్రోస్
నాగర్కర్నూల్, మే 22 : కరోనా నియంత్రణకు ఇం టింటి ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వైద్యా రోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్రోస్ సూచించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టకపోవడంపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు కలెక్టర్ శర్మన్తో కలిసి స్థానిక సాయిగార్డెన్లో వైద్యాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యధికగా కరోనా కేసులు ఉన్న వెల్దండ, తెలకపల్లి, రఘుపతిపేట తదితర పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు చేపట్టిన చర్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ సర్వే వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారం వరకు జిల్లాలో 5శాతానికి తక్కువగా ఉన్న కేసులు మే మొదటివారం వచ్చేవరకు 45శాతానికి పెరగడానికిగల కారణాలను అన్వేషించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి రిపోర్టు వచ్చేవరకు వేచి ఉండకుండా వైద్యం అందించాలని తెలిపారు. రేపటి నుంచి మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారంరోజుల్లో మంచి ఫలితం రావాలని, ఇందుకు అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు. లక్షణాలు ఉన్నవారిని పక్కాగా గుర్తించడంతోపాటు మందుల కిట్లు అందజేసి హోంఐసోలేషన్ లేదా కమ్యూనిటీ ఐసోలేషన్లో ఉంచి వారి ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్ తెలుసుకోవాలన్నారు. కొత్త వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వందేండ్లకు ఒకసారి ఇలాం టి మహమ్మారి రోగాలు వస్తుంటాయని, విపత్కర పరిస్థితిలో ప్రజల ప్రాణాలు కాపాడే అదృష్టం మనకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. అవసరమైన మందులు ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉండేవిధం గా చూసుకోవాలన్నారు. సకాలంలో మందులు వాడకపోవడంతోనే ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని, సకాలం లో మందులు వాడితే కొవిడ్ తగ్గిపోతుందన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించకుండా చూ డాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్, మండల ప్రత్యేకాధికారులు, కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.