అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, సినీహీరోల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువర్గాలు ఒకరికొకరు ధీటుగా స్పందిస్తు వ్యాఖ్యలు చేస్తున్నారు. టికెట్ల తగ్గుదలపై మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ముందుగా మీ లగ్జరీని తగ్గించుకోవాలని సినీహీరో సిద్ధార్థ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. తాము పన్నులు చెల్లిస్తున్నాం.. మా డబ్బులతో మీలో కొందరూ లగ్జరీని అనుభవిస్తున్నారు. మరికొందరూ అవినీతి, అక్రమాలతో కోట్లాదిరూపాయలను సంపాదిస్తున్నారు అని ట్విట్ చేశారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్ ఇవ్వండి అని సూచించారు.
నిన్న సినీ హీరో నాని మాట్లాడుతూ ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా కొట్ల కలెక్షన్లు బాగున్నాయని , సినిమా టికెట్ల ధరల తగ్గింపు సరైనది కాదని ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటి నుంచి ఈరోజు వరకు ముగ్గురు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని, తాజాగా అనిల్ కుమార్ యాదవ్ సినీ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ప్రేక్షకుడికి మేలు జరుగుతుందని చేసిన వ్యాఖ్యలకు సిద్ధార్థ పై విధంగా స్పందించారు.