దినేష్తేజ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. సురేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘కోడిపాయే లచ్చమ్మది’ అనే గీతాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ తెలంగాణ జానపద గీతాన్ని మంగ్లీ ఆలపించింది. సుభాష్ఆనంద్ స్వరాల్ని సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ పాటలో హెబ్బాపటేల్ నృత్యం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్ర గీతాలన్నింటిని చంద్రబోస్ రచించారు’ అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.