హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నటుడు కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. బాధ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు. జీవించినంత కాలం అందరినీ కలుపుకొని వెళ్లారన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం కృష్ణంరాజుకు నివాళులర్పించారు.