Chiranjeevi | తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్కు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. పరిశ్రమలోకి ప్రభావవంతులకు ప్రజాకళాకారుడు గద్దర్ పేరిట ప్రతియేటా ‘గద్దర్ అవార్డులు’ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారన్నారు. తెలుగు పరిశ్రమ తరఫున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నానంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. గతంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సినిమా పరిశ్రమలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై తాజాగా సీఎం స్పందించారు. రవీంద్రభారతిలో డాక్టర్ సినారె 93వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించినా చిత్ర పరిశ్రమ తమని స్పందించలేదని పేర్కొన్నారు. గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా సినీ రంగ ప్రముఖులు తమను సంప్రదించలేదన్నారు. నంది అవార్డుల స్థాయిలో ఆయా కార్యక్రమాలను చేపడుతామని.. ఇప్పటికైనా సినీ ప్రముఖులు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. మరి ఇప్పుడైనా సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కలుస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024