ఇటీవల కరోనాతో కన్నుమూసిన సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి అగ్రనటుడు చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చిరంజీవి అన్నారు. అతడి కుటుంబానికి ఎలాంటి అవసరమెచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబానికి సాయం అందించిన చిరంజీవికి టీఎన్ఆర్ సతీమణి కృతజ్ఞతలు తెలిపింది.