Chirnajeevi emotional about Puneeth Raj kumar | దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా రాజ్ కుమార్ కుటుంబంతో ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి కుటుంబంలో అందరి కంటే చిన్నవాడు పునీత్ హఠాన్మరణం చెందినపుడు మెగాస్టార్ చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత చిన్న వయసులో పునీత్ అందర్నీ వదిలేసి వెళ్ళిపోతాడు అని కలలో కూడా అనుకోలేదు అంటూ అప్పట్లో ఆయన కడసారి చూపు చూసేందుకు వెళ్లాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తాజాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. పునీత్ రాజ్ కుమార్తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు.
‘ప్రియమైన అప్పూ.. ఓ రోజు ఉదయాన్నే లేచి చూడగానే నువ్వు లేవన్నారు అనూహ్యంగా మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు వెళ్లిపోయావు. ఈ విషయాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్’ విడుదల అవుతోంది. ఈ సందర్భం మమ్మల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నువ్వు లేవన్న బాధ ఒకవైపు ఉన్నా కనీసం నీ ఆఖరి చిత్రం రూపంలో నువ్వు మరోసారి మమ్మల్ని పలకరించబోతున్నావు. కానీ ఈ సమయంలో నువ్వు మాతో లేవన్న నిజం కలచివేస్తోంది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు చిరంజీవి.
జేమ్స్ సినిమాను ఏకంగా 4 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు మరోవైపు కర్ణాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు పునీత్కు నివాళిగా మార్చి 17 నుంచి 23 వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. జేమ్స్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
“పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్లో కొత్త రికార్డులు..”
“కన్నడనాట మొదలైన పునీత్ రాజ్ కుమార్ దండయాత్ర..”
“జేమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్.. పునీత్ పవర్ కనిపిస్తుంది..”