టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్బాబు (Mahesh Babu) సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ అంత సులభంగా రాదనే సంగతి తెలిసిందే. తాజాగా అప్కమింగ్ హీరోయిన్ ఒకరు అలాంటి బంపర్ ఆఫర్నే కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ ఏడాది సుశాంత్తో కలిసి ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మోడల్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary). ఈ హర్యానా సుందరిని త్రివిక్రమ్ (Trivikram ) మహేశ్బాబుతో చేయబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎంపిక చేశాడట.
ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది త్రివిక్రమ్ టీం. మెయిన్ హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మహేశ్ డైరెక్టర్ పరశురాంతో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఒక్క సినిమాతోనే వరుసగా భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్, ప్రశాంత్నీల్ కాంబోలో వస్తున్న సలార్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
2018లో మిస్ ఇండియా టైటిల్ను కైవసం చేసుకున్న తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది మీనాక్షి. ఈ భామ ప్రస్తుతం ఖిలాడీ, హిట్ 2 చిత్రాలతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత