ఉదయ్, వైష్ణవి జంటగా రూపొందుతున్న చిత్రం ‘మధురం’. రాజేష్ చికిలే దర్శకుడు. బంగార్రాజు నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది.
ఫస్ట్లుక్ పోస్టర్కు చక్కని స్పందన వస్తున్నది. తప్పకుండా చిత్రం కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వెంకీ వీణ, సహ నిర్మాత: ప్రదీప్ కుమార్ సుప్రాణి.