తెలుగు ప్రేక్షకుల (Telugu Audience) గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాలో బాలరామాయణం (Bala Ramayanam) ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ (NTR) మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సిల్వర్ స్క్రీన్కు తొలిసారి పరిచయమైన చిత్రం. గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం విజయవంతంగా 25 వసంతాలు (Bala Ramayanam @25 Years) పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) ట్విటర్ ద్వారా వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
‘శబ్దాలయ థియేటర్స్ పతాకంపై ఎంఎస్ రెడ్డి (MS Reddy) నిర్మాతగా నా దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ మీందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నందమూరి తారక రామారావు మనవడు..జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా, సీత, లక్ష్మణుడు, భరత్ శత్రుఘ్నులు, రావణాసురుడు, హనుమంతులు..ఇలా చాలా మంది పిల్లలు ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక కృతజ్ఠతలు తెలియజేసుకుంటున్నాన’న్నారు.
On the occasion of #BalaRamayanam completing 25 years, Director #Gunasekhar garu expresses gratitude and thanks the audience with a heartfelt video.#25YearsForBalaRamayanam@tarak9999 @Gunasekhar1 #MSReddy#25YearsForBalaRamayanam pic.twitter.com/LGN1IXCHa6
— BA Raju's Team (@baraju_SuperHit) April 11, 2022
ఈ చిత్రాన్ని ప్రేక్షకులైన మీరు..అటు భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో మంచిగా అనిపించిందని గుణశేఖర్ తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మరో పౌరాణిక గాథ శాకుంతలం చిత్రంతో ఈ సంవత్సరం మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి, అభిమానిస్తారని ఆశిస్తుస్తున్నట్టు చెప్పారు గుణశేఖర్.