Nivetha Pethuraj Bloody Mery |విభిన్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి నివేథా పేతురాజ్. యువ హీరో విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో నివేథా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘చిత్ర లహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. ఈవిడ మొదటి నుంచే నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈమె మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌవుతుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్లడీ మేరీ’. ‘కార్తికేయ’ ఫేం చందూ ముండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ చిత్రం నేరుగా ‘ఆహా’లో ఏప్రిల్15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఆహా బృందం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆధ్యాంతం అకట్టుకుంటుంది. ‘ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని మరో మనిషి ఉంటాడు. అవసరం అవకాశాన్ని బట్టి ఆ మనిషి బయటకు వస్తాడు. మ్యాటరేంటంటే ఆ బయటకొచ్చిన మనిషే ఒరిజినల్’ అంటూ అజయ్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘కాలానికి విపరీతమైన మొమోరి పవర్ ఉంటుంది. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది.. వడ్డితో సహా’ అంటూ నివేథా చెప్పే డైలాగ్స్ తన పాస్ట్లో ఏదో దారుణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో నివేథా అంధురాలి పాత్రలో నటిస్తుంది. తనకు జరిగిన దారుణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే అంశంతో సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. కాల భైరవ నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ ఫీల్ను కలిగిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి బాగుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు.
Read Also:
N.T.R | జూ.ఎన్టీఆర్కు హీరోగా 25ఏళ్ళు.. ‘బాలరామాయణం’షూటింగ్లో తారక్ అంత అల్లరి చేశాడా?
Shiva Kumar Subramaniam | సినీఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు శివకుమార్ మృతి