Shiva Kumar Subramaniam | ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు, స్క్రీన్ ప్లే రైటర్ శివ కుమార్ సుబ్రమణ్యం కన్నుమూశారు. ఆదివారం రాత్రి ముంబైలో ఈయన తుదిశ్వాస విడిచాడు. స్క్రీన్ప్లే రైటర్గా కెరీర్ ప్రారంభించిన శివకుమార్ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాకీష్రాఫ్, అనీల్కపూర్ నటించిన ‘పరింద’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే రైటర్గానే కాకుండా నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. శివకుమార్ స్క్రీన్ ప్లే రైటర్గా దాదాపు 8 సినిమాల వరకు పనిచేశాడు.
ఈయన దాదాపు 30 సినిమాలలో నటించాడు. చివరగా ఈయన సాన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ సినిమాలో నటించాడు. 2స్టేట్స్, బంగిస్థాన్, ఉంగ్లీ, మీనాక్షి సుందరేశ్వర్ వంటి సినిమాలు ఈయనకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఈయన నటించాడు. ముక్తిబంధన్ , కిస్మత్, ప్రధాన మంత్రివి వంటివి బుల్లితెర ప్రేక్షకులకు శివకుమార్ను దగ్గర చేశాయి. ‘1942 :ఎ లవ్ స్టోరీ’, ‘తీన్ పత్తి’ సినిమాలకు కథను కూడా అందించాడు.
శివకుమార్ మృతి పట్ల బాలీవుడ్ సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈయన మరణ వార్త తెలియగానే బాలీవుడ్ ఫిలిం మేకర్ అశోక్ పండిట్ ట్విట్టర్లో ‘ప్రియమైన స్నేహితుడు శివ సుబ్రమణియన్ ఇకలేరని తెలిసి షాకయ్యా. ఆయన గొప్పనటుడే కాదు చాలా తెలివైన, మంచి మనసున్న మనిషి. ఆయన భార్య దివ్యకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ విషాదాన్ని ఎదుర్కొనేంత శక్తిని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాడు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Extremely shocked and pained to know about the tragic demise of our dear friend, a great actor and a brilliant human being Shiv Subramaniam.
My heartfelt condolences to his wife Divya. May God give you enough energy to face this tragedy .
ॐ शान्ति !
🙏 pic.twitter.com/LvTM0mZhFi— Ashoke Pandit (@ashokepandit) April 11, 2022