టాలీవుడ్ (Tollywood) యువ హీరో శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna). కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా నాలుగో పాట టైంను కూడా ఫిక్స్ చేశారు. మాంగళ్యం తంతునానేనా సాంగ్ (Mangalyam Song Promo) ప్రోమోను విడుదల చేశారు.
పెళ్లి సమయంలో ఉచ్చరించే మంత్రాలకు మాడ్రన్ టచ్ ఇస్తూ సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ అలరించడం ఖాయమని ప్రోమో ద్వారా అర్థమవుతుంది. పూర్తి పాటను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ దేవీ శ్రీప్రసాద్ (Devi Sri Prasad) స్వయంగా రాసి..కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటను జాస్ప్రీత్ జాజ్ పాడాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 4న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.