Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికే మోహన్బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. మంచు మనోజ్ కాళ్లకు గాయాలవడంతో బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. తాజాగా ఈ వ్యవహారంలో మంచు మనోజ్పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంచు మనోజ్ పహాడి షరీఫ్లో తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని మనోజ్ పోలీసులను కోరాడు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఎంట్రీ ఇవ్వగా.. మరి ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తెలియాల్సి ఉంది.
Fear Trailer | సైలెంట్గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్గా వేదిక ఫియర్ ట్రైలర్