దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా నటి, నిర్మాత మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. బూచోడు వంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నానని..చివరికి దొరికిపోయానని ఆమె సోషల్మీడియా ద్వారా తెలిపింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలని కోరింది.