Sharwanand | టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా చేస్తున్న తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్తో పాటు టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి చిత్రయూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను జూన్ 07న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ ను చూపించబోతున్నట్లు శ్రీరామ్ ఆదిత్య తెలిపాడు. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
#Manamey is all set to paint your hearts & screens worldwide from 𝐉𝐔𝐍𝐄 𝟕𝐭𝐡! ❤🔥
Get ready to celebrate The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the Season in theatres 🤩#ManameyOnJune7th 🥳 @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg… pic.twitter.com/48rKnvIF2p
— BA Raju’s Team (@baraju_SuperHit) May 24, 2024