Mahesh Babu |సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గోంటుంది. ఇటీవలే పరశురాం, కీర్తిసురేష్ ప్రమోషన్లలో పాల్గొని చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక పోలీస్ గ్రౌండ్స్లో శనివారం గ్రాండ్గా జరుగనుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు అభిమానులకు ఓ బహిరంగ లేఖను రాశారు.
ఆ లేఖలో ‘సర్కారు వారి పాట అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు’ అని లేఖలో వెల్లడించాడు. అంతేకాకుండా త్రివిక్రమ్తో తన సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో మొదలు కాగలదు అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్గా మారింది. బ్యాంకింగ్ స్కామ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థలతో కలిసి మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Superstar @urstrulyMahesh's letter to fans. #SSMB28 will start from June.
#SVP #SVPMania #SarkaruVaariPaata pic.twitter.com/Yu7vhXzi0v
— BA Raju's Team (@baraju_SuperHit) May 7, 2022