సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata) సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) . ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత మహేశ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ ట్రిప్ వేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా మహేశ్ యూరప్లో రోడ్ ట్రిప్లో ఉన్నపుడు సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి సెల్పీ దిగి నెట్టింట్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. తాజాగా మహేశ్ యూఎస్లో ల్యాండింగ్ అయ్యాడు.
ఈ సారి న్యూయార్క్లోని మన్హట్టన్ (5th Avenue, Manhattan)లో బిజీగా ఉండే 5th Avenue వెంట నడుచుకుంటూ వెళ్లాడు మహేశ్. ఈ విజువల్స్ ను జావియర్ అగస్టీనా తన కెమెరాలో బంధించాడు. వీడియోను మహేశ్ ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘5th Avenueలో షికారును మరేదీ అధిగమించలేదు..ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన క్రెడిట్ మళ్లీ నా స్నేహితుడైన జావియర్ అగస్టీనా (xavier augustina)కు వెళ్తుంది.. ’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మహేశ్తోపాటు నమ్రతను కూడా వీడియోలో చూడొచ్చు. ఈవీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మహేశ్ బాబు త్వరలో టూర్ ముగించుకుని ఇండియాకు తిరిగిరానున్నాడు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోయే సినిమా షూట్తో బిజీగా కానున్నాడు. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం జులైలో త్రివిక్రమ్-మహేశ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.
Read Also : Venu Udugula | విరాటపర్వం డైరెక్టర్తో పవన్ కల్యాణ్ సినిమా పరిస్థితేంటి..?
Read Also : Telugu film workers | సినీ కార్మికుల సమ్మె..రేపటి నుంచి షూటింగ్స్ బంద్
Read Also : Ganesh Acharya | విష్ణు, సన్నీ, పాయల్తో బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ స్టెప్పులు