ఇటీవలే విరాటపర్వం (Virata Parvam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula). ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు వేణు స్టార్ హీరో పవన్ కల్యాణ్కు ఓ కథ వినిపించాడని, సినిమాకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో విరాట పర్వం కొంత వెనుకపడిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
కానీ పవన్ కల్యాణ్కు ఒకసారి సినిమా నచ్చిందంటే చాలు. కలెక్షన్లతో సంబంధం లేకుండా సినిమా చేస్తాడన్న టాక్ కూడా ఇప్పటికే ఉంది. ఇపుడున్న పరిస్థితులను చూస్తుంటే సినిమా పట్టాలెక్కే ఛాన్స్ దాదాపు లేనట్టేననిపిస్తుందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోవైపు అక్టోబర్ నుంచి పొలిటికల్ టూర్ ప్లాన్ రెడీ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో క్రిష్ తో చేస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) చేయనున్నాడు.
మరోవైపు సముద్రఖనితో చేయబోయే వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ (Vinodhaya Sitham remake) ప్రాజెక్టు కూడా చేయాల్సి ఉంది. పొలిటికల్ ప్లాన్ షురూ అయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. పవన్ ఈ ప్రాజెక్టులనే అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడా..? అన్న డిస్కషన్స్ కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. అంటే ప్రస్తుతానికి లైన్లో పెట్టిన సినిమాలు తప్పించి పవర్ స్టార్ మరో సినిమాను చేసే పరిస్థితులు దరిదాపున కూడా కనిపించడం లేదు.
ఎలా చూసుకున్నా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పవన్-వేణు కాంబినేషన్లో సినిమా ఎక్స్ పెక్ట్ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు ఇన్సైడ్ టాక్. ఇపుడు కాకున్నా పొలిటికల్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతైనా ఈ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందా..? అనేది చూడాలి.