రీసెంట్గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు మహేశ్బాబు (Mahesh Babu). ఈ మూవీ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్ టూర్ లో ఉన్నాడు. బ్రేక్ దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటాడని తెలిసిందే. తాజాగా ఫ్యామిలీ ట్రిప్లో ఉన్న ఈ సూపర్ స్టార్ ఇన్ స్టాగ్రామ్లో ఫొటోలను ఓ సెల్ఫీ స్టిల్ ను పోస్ట్ చేశాడు.
నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar), గౌతమ్ (Gautham), సితార (Sitara)తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ..ఇది రోడ్ డ్రిప్..నెక్ట్స్ స్టాప్ ఇటలీ. క్రేజీ వ్యక్తులతో లంఛ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు మహశ్. ఇంతకీ రోడ్ ట్రిప్లో ఉన్న మహేశ్ ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉన్నాడనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే యాక్షన్ ఎంటర్టైనర్గా త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాను త్వరలో ప్రారంభించబోతున్నాడు మహేశ్. మహేశ్ బాబు ఫ్యామిలీ ముగించుకుని..ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
మరోవైపు స్టార్ డైరెక్టర్ రాజమౌళితో కూడా అడ్వంచెరస్ ప్రాజెక్టును చేయనున్నాడు. సౌతిఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రాబోతుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..