Mahesh Babu | టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే. వరుస సినిమాలు, కుటుంబంతో బిజీగా ఉండే ఆయన.. మరోవైపు సామాజిక సేవ చేస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో చిన్నారులకు తన వంతు సాయం చూస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేశ్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు.
తన తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) భౌతికంగా అందరికీ దూరమై నిన్నటితో (నవంబరు 15) ఏడాది అయిపోయిన విషయం తెలిసిందే. అయితే కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు అండగా నిలిచే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేష్. 40 మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ‘సూపర్స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో’ (Superstar Krishna Educational Fund) స్కాలర్షిప్ అందించనున్నారు. ఇక పాఠశాల చదువు నుంచి పీజీ వరకు అండగా ఉండేందుకు పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.
ఇక మహేశ్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
As a tribute to Superstar Krishna garu, The Mahesh Babu foundation has recently launched the Superstar Krishna Educational Fund. @urstrulyMahesh pic.twitter.com/wd4WL3KJU5
— Mahesh Babu Foundation (@MBfoundationorg) November 15, 2023