ఆగష్టు 9, 1975న జన్మించిన మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థిరపడ్డారు. నటశేఖరుడు కృష్ణ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘రాజకుమారుడు చిత్రంతో హీరో అయ్యాడు.అంతక ముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణతో కూడా కలిసి పని చేశారు. 1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పోరాటం’ సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించాడు. ఆ తరువాత వరుసగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’ చిత్రాలతో బాల నటుడిగా మెప్పించాడు మహేష్.
1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి హీరోగా 26 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను అందుకున్నాడు. అయితే మహేష్ గురించి తెలియని ఆసక్తికర విషయాలలో ముఖ్యమైనది ఏంటంటే..మహేష్కి ఇప్పుడు తెలుగు చదవడం రాదు. అతను చెన్నైలో పుట్టి పెరిగాడు. దీంతో తెలుగు భాష నేర్చుకోవడానికి అవకాశం లేదు. అతను తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు, కానీ చదవలేడు. అతను దర్శకులు చెప్పిన డైలాగ్స్ విని సినిమాలో చెబుతుంటాడు.
మహేష్ బాబు చెన్నైలోని సెయింట్బెడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. తమిళ సూపర్స్టార్ సూర్య సోదరుడు తమిళ నటుడు కార్తీ కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. సామాజిక సేవ కూడా మహేష్లో చాలా ఎక్కువే. ఇతను తన సంపాదనలో 30 శాతం స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తాడు. మహేష్ ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం అనే రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పర్సనల్ విషయానిక వస్తే 2005లో నమ్రతని ప్రేమ వివాహం చేసుకున్న మహేష్.. గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారాడు. నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ ఇంకా నవ యువకుడిలానే కనిపిస్తున్నాడు.