ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చితార్థం జరగగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు వైరల్గా మారాయి.
మహతి సాగర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. సాగర్ ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
మణి శర్మ కొన్నాళ్లుగా తన సంగీతంతో తెలుగువారిని అలరించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం ఓ రేంజ్లో ఉంటుంది. మణిశర్మ మొదటగా 1992లో వచ్చిన రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతాన్ని అందించారు.
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం