ఎంపీ సంతోష్కుమార్ ఆరంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ మహాయజ్ఞంలో సినీతారలు ఉత్సాహంగా పాలుపంచుకుంటూ పర్యావరణ స్పృహను చాటుతున్నారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో ‘మహా సముద్రం’ చిత్ర నాయకానాయికలు సిద్ధార్థ్, అదితీరావు హైదరీ .. నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు అజయ్భూపతి పాల్గొన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో మొక్కలు నాటారు. ప్రకృతి పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్కుమార్ అంకితభావంతో కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.