బడంగ్పేట, మే 4 : ప్రజారోగ్యమే పరమావధిగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు 38 పడకల కొవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హల్లో 38 పడకల సామర్థ్యం గల కొవిడ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లక్షణాలు ఉన్నవారు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా హోం ఐసోలేషన్ ఉండి కరోనాను జయించవచ్చన్నారు. మీర్పేట, బడంగ్పేట, జెల్పల్లి మున్సిపల్కు సంబంధించిన వారు కొవిడ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవిడ్ బాధితులకు ఆహారం అందజేస్తున్నారన్నారు. ఉచితంగా ఫంక్షన్ హాల్ ఇచ్చిన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ కుమార్ను ఆదేశించిన 36 గంటల్లో 38 పడకల కొవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో స్వరాజలక్ష్మి, చైర్మన్ అబ్దుల్లా సాదీ, బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.