ఇండస్ట్రీలో కరోనా ఎంతో మందికి కడుపు కోతతో పాటు ఎప్పటికీ ఆరని మంటలు రేపింది. ముఖ్యంగా సీనియర్ నటి కవిత అయితే తన కుటుంబంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కరోనా కారణంగా కోల్పోయారు. ఈమె భర్త దశరథ రాజు ఈ మధ్యే కరోనాతో కన్నుమూశారు. దాదాపు నెల రోజుల కింద ఈయన కరోనా బారిన పడ్డారు. మధ్యలో ఓ సారి నయం అయింది కూడా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దాంతో హాస్పిటల్కు తరలించారు. అక్కడే దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. అయితే ఈయన చనిపోయే 20 రోజుల ముందే కవిత కొడుకు కూడా మరణించాడు. ఈయన కూడా కరోనా రక్కసికే బలైపోవడం గమనార్హం.
కుటుంబంలో ఇద్దరు ఒకేసారి కరోనాతో మరణించడంతో కవితను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అటు కొడుకు మరణం మరిచిపోకముందే భర్త కూడా దూరం కావడంతో కవిత ఒంటరి అయిపోయారు. ఈమెను చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ లోనే పరామర్శించారు. అయితే ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యులు కొందరు కవిత ఇంటికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మా అధ్యక్షుడు నరేష్ తో పాటు కరాటే కళ్యాణి మరికొందరు సభ్యులు కూడా కవిత ఇంటికి వచ్చి అండగా నిలిచారు. ఆమెను ఓదార్చారు.. ఎలాంటి సాయం కావాలన్నా కూడా మొహమాటపడకుండా అడగాలంటూ నరేష్ కోరారు. కవితకు దేవుడు చాలా అన్యాయం చేశాడంటూ మా సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమీర్ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
మెహ్రీన్ కౌర్ కంటే ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
దయచేసి థియేటర్స్ తెరిచే వరకు ఆగండి : తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ విన్నపం
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు