‘ఇందులోని నా పాత్రలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపిస్తా.’ అని ఆయుషి పటేల్ అంటున్నది. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘కలియుగ పట్టణంలో’. విశ్వకార్తికేయ కథానాయకుడు. రమాకాంత్రెడ్డి దర్శకుడు. డాక్టర కందుల చంద్ర ఓబుల్రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయుషి పటేల్ విలేకరులతో ముచ్చటించింది. ‘చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. పవన్కల్యాణ్ ఫ్యాన్ని. ఆయనలా ఎదగాలనుకునేదాన్ని. అనుకోకుండా ఈ సినిమాతో హీరోయిన్ అయ్యాను. కడపలో అందమైన లొకేషన్లలో ఈ సినిమా తీశారు. అక్కడి ప్రజలు నన్నెంతో సపోర్ట్ చేశారు. నా తొలి సినిమా అనుభవాన్ని జీవితంలో మరిచిపోలేను.’ అని తెలిపింది ఆయుషి. రెండు గంటలు ఈ కథను దర్శకుడు నేరేట్ చేశాడని, అలాగే క్లారిటీగా సినిమా తీశాడని, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడలేదని, మంచి టీమ్తో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయుషి పటేల్ అన్నారు.