భారత సినీ అభిమానులకు ఈరోజు చీకటి దినం. భారత సంగీత చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకొని గాన కోకిల లతా మంగేష్కర్ ఈ లోకం వీడి వెళ్లిపోయారు. దీంతో యావత్ దేశం అంతా తనకు నివాళులు అర్పిస్తోంది. లతా మంగేష్కర్ అంతిమ యాత్రలో తన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తన నివాసం ప్రభుకుంజ్ నుంచి శివాజీ పార్క్ వరకు నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తన పార్థీవదేహాన్ని శివాజీ పార్క్కు తీసుకొచ్చారు. కాసేపట్లో తన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. తనకు నివాళులర్పించనున్నారు. లతా మంగేష్కర్ను కడసారి చూడటానికి శివాజీ పార్క్కు భారీగా అభిమానులు తరలివచ్చారు.
Maharashtra | Veteran singer Lata Mangeshkar's mortal remains reach Shivaji Park in Mumbai for last rites pic.twitter.com/6YVNsoSHiJ
— ANI (@ANI) February 6, 2022
లతా మంగేష్కర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తన అంత్యక్రియలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.
Mumbai | People join the funeral procession of #LataMangeshkar as it proceeds to Shivaji Park from her 'Prabhukunj' residence
The last rites of the legendary singer will be performed at Shivaji Park today evening pic.twitter.com/poVpSWNm2f
— ANI (@ANI) February 6, 2022
లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ, రేపు రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.