టాలీవుడ్ నటి లక్ష్మిమంచు (Lakshmi Manchu) తెలుగు కుకరీ షో ‘ఆహా భోజనంబుసను ( Aha Bhojanambu) చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. మంచి భోజనకారి అయిన మంచువారమ్మాయి..తనకిష్టమైన భోజనం కోసం చాలా దూరం వెళ్లిన రోజులున్నాయని చెప్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇష్టమైన ఆహారం నా దగ్గర ఉండేది కాదు. థాయ్, వియత్నామీస్, చైనీస్, ఇటాలియన్ పుడ్ చాలా ఇష్టం
. ఆహారం కోసం ట్రావెలింగ్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తా. కేవలం ఆహారం కోసమే చాలా దూరం వెళ్లి..తిరిగొచ్చిన రోజులున్నాయి. వివిధ పద్దతుల్లో తయారుచేసిన వంటకాలు, డిఫరెంట్ రుచులు అంటే తనకు చాలా ఇష్టమని, తాను ఇప్పటికీ ఫ్రెంచ్ వంటకాలకు అలవాటు పడుతున్నానని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. 8 పార్టులుగా వస్తున్న ఆహా భోజనంబు సిరీస్ లో ప్రతీ సారి సెలబ్రిటీ గెస్ట్ను ఆహ్వానిస్తుంది లక్ష్మి మంచు. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ కుకరీ షో. ఆస్ట్రేలియన్ టాప్ చెఫ్ తోపాటు ఇతర కుకింగ్ షోలంటే ఇష్టపడే మంచు బ్యూటీ వాటిలాగే ఆహా భోజనంబు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu Sarkaru Vaari Paata |మహేశ్ బాబు ఫస్ట్ లుక్ సరికొత్త రికార్డు
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..