Rajendra Prasad-Archana | ముప్పై ఏడేళ్ల కిందట వచ్చిన లైడీస్ టైలర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఒక హాస్య ప్రధాన చిత్రానికి ఆ స్థాయిలో కలెక్షన్లు రావడం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యంలో పడ్డారు. కలెక్షన్ల మాట అటుంచితే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీకి ముగ్ధుడవడని ప్రేక్షకుడు లేదు. ఈ సినిమాలో వీళ్లిద్ధరి మధ్య సీన్స్ అన్ని ఓ రేంజ్లో పేలాయి. కాగా తాజాగా వీళ్ల కాంబో మరోసారి రిపీట్ కానుంది.
రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో ‘షష్టి పూర్తి’ అనే సినిమా తెరకెక్కుతుంది. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రూపేష్ కుమార్, ఆకాంక్షా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించింది. ఇక శనివారం ఈ సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టులో ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.