టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసినవాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని మంత్రి తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్కు కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నిత్యం ప్రజాసంక్షేమం కోసం పరితపించే మంత్రి కేటీఆర్ వైరస్ నుంచి త్వరగా బయటపడాలని అందరు ఆకాంక్షిస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్లో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. వైరస్ నుండి త్వరగా బయటపడి మరింత శక్తివంతంగా మళ్లీ ప్రజల ముందుకు వస్తారని నేను విశ్వసిస్తున్నాను అని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
ఇవికూడా చదవండి..