Kriti Sanon-Prabhas | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు ప్రభాస్, ఇటు కృతి ఇద్దరూ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయినా వార్తలకు ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. తాజాగా వీరి పెళ్లి వార్త మరోసారి హాట్టాపిక్గా మారింది. వీరిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం (Engagement) చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ సోషల్మీడియా సహా పలు వెబ్సైట్లలో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసింది. ‘ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ కేవళం మంచి స్నేహితులు మాత్రమే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని వెల్లడించింది.
ప్రభాస్, కృతిసనన్ జటంగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రామాయణం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను రూపొందించాయి. ఇక ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.