Kota Srinivasa rao | ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) (Srinivasa Rao) అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో కోట మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.