పుడమితల్లిని హరితశోభతో అలంకరిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ జయప్రదంగా కొనసాగుతున్నది. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయిక కొణిదెల నిహారిక జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటింది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గొప్ప కార్యక్రమమిదని ఆమె కొనియాడింది.