ఖుష్బూ సుందర్ (Khushboo Sundar)..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 1980-90లలో దక్షిణాదిన బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచి..తన అందచందాలతో బాక్సాపీస్ను షేక్ చేసింది. అయితే పెళ్లయిన తర్వాత రెగ్యులర్ సినిమాల నుంచి తప్పుకుంది. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెద్దన్న (Peddanna)చిత్రంతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఈ మూవీ తర్వాత ఖుష్బూ తన ఫోకస్ అంతా టాలీవుడ్పైనే పెట్టినట్టు కనిపిస్తోంది.
శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు () లో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తో ముందుకెళ్తుంది. మరోవైపు యాక్షన్ గోపీచంద్ నటిస్తున్న 30 (Gopichand 30)వ ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం ఖుష్బూను ఎంపిక్ చేశారు మేకర్స్. శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ గురువారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించగా..షూటింగ్ కూడా షురూ అయింది. ఖిలాడీ ఫేం డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది.
చాలా కాలం తర్వాత ఖుష్బూ తెలుగు ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఖుష్బూ ప్రయాణం టాలీవుడ్ లో ఎలా ఉండబోతున్నది కొంత కాలం ఆగితే తెలుస్తుంది.