ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అది కేవలం కన్నడలో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రెండో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఇంకో రేంజ్లో ఉంది. కేవలం నాలుగు నెలల గ్యాప్లోనే రెండు పాన్ ఇండియన్ సినిమాలను రిలీజ్ చేసి స్టార్ డైరెక్టర్ అయిపోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా 50 శాతం పూర్తి అయిపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు మిగిలిన 50 శాతం కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఉగ్రం సినిమా కథను ప్రభాస్ ఇమేజ్కు సరిపోయేలా మార్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో కొన్ని ఛత్రపతి ఛాయలు కూడా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్లో కేజీఎఫ్ 2, ఏప్రిల్లో సలార్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు గానీ విజయం సాధిస్తే కచ్చితంగా ప్రశాంత్ నీల్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటి తర్వాత జూనియర్, ఎన్టీఆర్ అల్లు అర్జున్ లతో సినిమాలకు కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్