నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబినేషన్లో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి (veerasimhareddy). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తున్నాడు. కాగా డైరెక్టర్ గోపీచంద్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించి నందమూరి అభిమానులు, ఫాలోవర్లలో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ యాక్టర్ భాగం అయ్యాడు.
కేజీఎఫ్ ప్రాంచైజీలో ఆండ్రీవ్స్ పాత్రలో నటించిన కన్నడ యాక్టర్ అవినాష్ (KGF Avinash) పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో గంగిరెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. ప్రస్తుతం గంగిరెడ్డి పోర్షన్ షూట్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. అవినాష్ పాత్ర ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమట. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
బాలకృష్ణకు అఖండ చిత్రం తర్వాత మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించేందుకు రెడీ అవుతున్నాడు థమన్. రాయలసీమ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు ఇప్పటివరకున్న టాక్. పవర్ ఫుల్ పక్కా మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Shooting for #VeeraSimhaReddy!
Gangi Reddy will go on to be etched as one of the most powerful characters, and that credit will primarily go to @megopichand sir for envisioning such a character and @RishiPunjabi5 sir for capturing that enormously cruel vision.@MythriOfficial pic.twitter.com/ay8tomX2jB
— Avinash (@andrews_avinash) November 12, 2022