తిరుమల: తిరుమలలోని శ్రీవారిని కేజీఎఫ్ చిత్ర కథానాయకుడు యష్ దర్శించుకున్నారు. కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్లో భాగంగా కేజీఎఫ్ 2 హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈనెల 14న కేజీఎఫ్ 2 విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది.
అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.