keerthy suresh | ఈ మధ్య హీరోహీరోయిన్లు చాలామంది యాంకర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇన్ని రోజులు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించిన వాళ్లు.. ఇప్పుడు టీవీలో దర్శనమిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో టాక్ షోల పేరిట హీరోహీరోయిన్లను యాంకర్లుగా తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సైతం సత్తా చాటుతున్నాడు. నాగార్జున బిగ్బాస్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి కూడా టీవీ షోతో మెప్పించాడు. రానా, తమన్నా, సమంత కూడా యాంకర్గా మారి టాక్ షోలతో అలరించారు. ఎవరూ ఊహించని విధంగా బాలకృష్ణ కూడా త్వరలోనే యాంకర్ అవతారం ఎత్తుతున్నాడు. ఆహా కోసం ఈయన అన్స్టాపబుల్ ( unstoppable ) అనే టాక్ చేస్తున్నాడు. నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఈ టాక్ షో మొదలు కానుంది. ఇప్పుడు వీరందరి బాటలో మహానటి కీర్తి సురేశ్ కూడా యాంకర్గా మారబోతోంది.
ప్రముఖ ఛానల్లో త్వరలో ప్రారంభం కానున్న ఒక కార్యక్రమానికి కీర్తి సురేశ్ యాంకరింగ్ చేయబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా నాలుగు భాషల్లో భారీ స్థాయిలో ఈ షో మొదలుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కీర్తి సురేశ్ కేవలం హోస్ట్గానే కాకుండా.. గేమ్స్ ఆడిస్తూ.. వచ్చిన గెస్ట్లతో పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా చేయబోతోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి కీర్తి సురేశ్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కొక్క ఎపిసోడ్కు దాదాపు 15 లక్షల వరకు కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేశ్. మహేష్ బాబు సర్కారు వారి పాట, నాని దసరా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో చాలా బిజీగా ఉంది కీర్తి సురేశ్. ఇలాంటి సమయంలో కూడా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ మహానటి. ఇప్పటికే తమన్నా, కాజల్, సమంత లాంటి చాలా మంది స్టార్ హీరోయిన్స్ టీవీల్లో కూడా తమ సత్తా చూపించారు. మరి ఇప్పుడు కీర్తి సురేశ్ ఏం చేయబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
keerthy suresh | కీర్తిసురేశ్కు వాళ్ల అమ్మ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?
Keerthy Suresh | కమెడియన్ తో కీర్తిసురేశ్ సినిమా..రిస్క్ చేస్తుందా..?
Keerthy Suresh| టాప్ బ్యానర్ లో కీర్తిసురేశ్..ఆ క్రేజీ రీమేక్ ఏంటో తెలుసా..?
Keerthy Suresh: స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్