సినీ పరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించడానికి ఒక్క హిట్ సినిమా చాలు. సరైన ప్రాజెక్టు చేతిలో పడి ఉత్తమ యాక్టింగ్ ను చూపించిన యాక్టర్లను ప్రేక్షకులను ఆకాశానికెత్తేస్తారు. అలాంటి ప్రశంసలే అందుకుని ఇపుడు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది కోలీవుడ్ (Kollywood) భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). సినీ ఇండస్ట్రీలో నటనకు ఆస్కారమున్న ఒక్క మంచి రోల్ పడిందంటే చాలు స్టార్ హీరోయిన్ గా పునాదులు వేసుకున్నట్టే. ఈ క్రేజీ ఛాన్స్ ను మహానటి సినిమాతో చేజిక్కించుకుంది కీర్తిసురేశ్. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు ప్రాణం పోసి నటనకుగాను అవార్డును కూడా అందుకుంది.
ఈ స్టార్ హీరోయిన్ ఇపుడు మరో క్రేజీ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేయబోతుందన్న వార్త సౌతిండియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? బాలీవుడ్ భామ కృతిసనన్ (Kriti Sanon). ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిమీ (Mimi). పంకజ్ త్రిపాఠి (Pankaj Triparthi) మరో లీడ్ రోల్ లో నటించాడు. లేటెస్ట్ వార్త ఏంటంటే..ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మిమీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.
తెలుగు, తమిళ భాష్లో రాబోయే చిత్రం కావడంతో మేకర్స్ కీర్తిసురేశ్ ను లీడ్ రోల్ కోసం సంప్రదించారట. అంతేకాదు స్క్రిప్ట్ కీర్తిసురేశ్ కు కూడా నచ్చిందని టాక్. అయితే కీర్తిసురేశ్ నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఎప్పుడొస్తుందా..? అని మేకర్స్ ఎదురుచూస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరి కీర్తిసురేశ్ ఒకే అయితే..పంకజ్ త్రిపాఠి పోషించిన పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర