మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారు వారి పాట’తో పాటు చిరంజీవి ‘భోళాశంకర్’లో నటిస్తోంది.
కీర్తి సురేష్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోలతో నటిస్తోంది. ఇంకా అమ్మడు ఒక్కో సినిమాకు ప్రస్తుతం మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్లో ఆయన చెల్లెలిగా నటించేందుకు కూడా భారీ మొత్తం డిమాండ్ చేసినట్టు సమాచారం.
అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న మన హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపారాలు చేస్తున్నారు.తాజాగా కీర్తి సురేష్ కూడా కొత్తవ్యాపారం మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్తో కలిసి భూమిత్ర బ్రాండ్ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్నట్లు కీర్తి తెలిపారు.