Keerthi Suresh | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్లుగా నిలిచాయి. మహానటి తర్వాత ఇప్పటివరకు కీర్తీ నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. గతరెండేళ్ళుగా ఈమె హిట్టుకోసం ఎంతగానో ఎదురుచూస్తుంది.
ప్రస్తుతం ఈమె ‘సాని కాయిదమ్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ను స్కిప్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం నేరుగా ఏప్రిల్ 8నుంచి అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా పరిచయవుతున్నాడు. ‘7/G బృందావన్ కాలనీ’, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే’, ‘యుగానికి ఒక్కడు వంటి’ సినిమాలకు సెల్వ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్ చెల్లెలిగా కీర్తీ సురేష్ నటించింది. ఎలాంటి అంచనాల్లేకుండా షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం గతేడాది విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్తో ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసింది. తాజాగా విడుదలైన సెల్వరాఘవన్ పోస్టర్కు విశేష స్పందన వచ్చింది. 1980లలో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. సెల్వరాఘవన్, కీర్తీసురేష్ ఇద్దరూ ఈ చిత్రంలో డీ గ్లామర్గా నటించారు. ఇక కీర్తీ సురేష్ ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి’ పాట సినిమాతో బిజీగా గడుపుతుంది.
ఇవి కూడా చదవండి:
Beast | ‘బీస్ట్’ విడుదల తేదీ ఖరారు.. ‘కేజీఎఫ్-2’తో పోటీని తట్టుకుంటుందా?
Ram Charan-Shankar | మరోసారి రామ్చరణ్కు విలన్గా.. ఆ సీనియర్ స్టార్ హీరో?
Radhe Shyam | ‘రాధేశ్యామ్’ మరో రికార్డు.. రూ.400కోట్ల క్లబ్లోకి ఎంట్రీ?
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?