Katrina Wedding | మరికొన్ని రోజుల్లో బాలీవుడ్ తారలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందే వారిపై తాజాగా ఒక పోలీసు కేసు పడిందట. అదేంటంటే.. వీళ్ల పెళ్లి కోసం జైపూర్లోని హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా కోటలో జరగబోతోంది.
ఇక్కడకు చాలామంది సెలబ్రిటీలు కూడా వస్తున్నట్లు సమాచారం. వారి భద్రత తదితర సమస్యల దృష్ట్యా హోటల్కు వచ్చే మార్గాన్ని ఈ నెల 6 నుంచి 12 వరకూ క్లోజ్ చేశారు. అయితే స్థానికంగా ఉన్న చౌత్ మాత ఆలయానికి వెళ్లాలంటే ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుడికి మరో దారి లేదు. ఇలాంటి రోడ్డును క్లోజ్ చేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
దీంతో నేత్రబింద్ సింగ్ జాడోన్ అనే లాయర్.. విక్కీ-కత్రినాతోపాటు వీళ్ల పెళ్లి జరగబోతున్న హోటల్ యాజమాన్యంపై కేసు పెట్టాడు. స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, విక్కీ-కత్రినా పెళ్లికి బాలీవుడ్ స్టార్లయిన కరణ్ జోహార్, ఫరా ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్, కబీర్ ఖాన్, మిని మాథుర్, రోహిత్ శెట్టి తదితర ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం.