కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామ జోరు చూపిస్తున్నది. ‘పుష్ప’ విజయంతో రష్మిక మందన్న జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. వరుస విజయాలతో భారీగా ఆర్జిస్తున్న ఈ సొగసరి తన సొంత పట్ణణం కూర్గ్తో పాటు హైదరాబాద్, ముంబయి, గోవా, బెంగళూరులో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందని ఇటీవల సోషల్మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై స్పందించింది రష్మిక మందన్న. ‘ఇలాంటి వార్తలు వినడానికి చాలా బాగుంటాయి. ఆ ఊహలన్నీ నిజమైతే బాగుండునని నేనూ కోరుకుంటున్నా.
సోషల్మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్నీ ఎవరో సరదాగా సృష్టించినవి కావొచ్చు. వాటిలో ఏ మాత్రం నిజం లేదు’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ ‘పుష్ప-2’ చిత్రంతో పాటు హిందీలో ‘యానిమల్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.