Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. దసరా సందర్భంగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని రాంలీలా మైదానం (Ram Leela Maidan)లో నిర్వహించిన ‘రావణ్ దహన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ రావణ దహనం చేశారు. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఓ మహిళ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. దీంతో రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన రికార్డుకెక్కారు.
కాగా, రావణ్ దహన్ కార్యక్రమంలో కంగన సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఎర్రటి చీర ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. జై శ్రీరామ్ అంటూ రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తదితరులు హారయ్యారు.
𝗞𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗥𝗮𝗻𝗮𝘂𝘁 made history by being the first woman to set ablaze 𝗥𝗮𝘃𝗮𝗻𝗮’s effigy at Delhi’s Lav Kush Ramlila event. She shot an arrow to set fire to the demon king’s effigy while chanting ‘𝗝𝗮𝗶 𝗦𝗵𝗿𝗲𝗲 𝗥𝗮𝗺’ 🙏🏻#KanganaRanaut #Dusshera2023… pic.twitter.com/CPt8RRiI3G
— Rahul Chauhan (@RahulCh9290) October 25, 2023
Also Read..
Vinayakan | జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా?
China | చైనాలో మరో ఇద్దరు మంత్రులపై వేటు.. ఎందుకంటే?