Kangana Ranaut | బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కంగనా.. ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కంగనా.. తన సొంత ఇండస్ట్రీ బాలీవుడ్పై కూడా పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ను విమర్శిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటిదాకా ట్విట్టర్ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మూగది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
‘ఇన్స్టాగ్రామ్ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి.